ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని వారి నివేదికలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరభద్ర చారి, తదితరులు పాల్గొన్నారు.