NLG: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని జడ్పీ కార్యాలయంలో ”ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా సమన్వయంతో పనిచేయాలన్నారు.