PDPL: ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ఇవాళ ఆయన పెద్దపల్లి ప్రజాప్రతినిధుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉపయోగపడే రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య నిర్వహణ, చెట్ల పెంపకం మొదలగు పనులు చేపట్టాలని సూచించారు.