SRCL: భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే రసాయన ఎరువులు వాడాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ హరికృష్ణ సూచించారు. హన్మాజీపేట రైతు వేదికలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఆయిల్ పామ్, ప్రకృతి వ్యవసాయం, కూరగాయల సాగుతో అధిక లాభాలు గడించవచ్చని హరికృష్ణ అన్నారు. AO వినీత రెడ్డి పాల్గొన్నారు.