SDPT: చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రధానోపాధ్యాయులుగా హారిక, డీఈవోగా దీక్షిత్, ఎంఈవోగా యశ్వంత్ పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద , ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.