KNR: గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం, రేపటి నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుంచి కొనసాగించనున్నట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.