మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి స్వర్గీయ నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డా. రాంచందర్ నాయక్ పాల్గొన్నారు. కాగా, ఏర్పాట్లను ఎమ్మెల్యే డా. భూక్య మురళీనాయక్, మాజీ ఎంపీ ఆర్. సురేందర్ రెడ్డి, కలెక్టర్ తదితరులు నిర్వహించారు.