NLR: బుచ్చి పట్టణంలోని 7వ వార్డు ఖాజ నగర్లో ‘ప్రశాంతమ్మ ప్రజా పాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళీ, పట్టణ అధ్యక్షుడు గుత్తా శీనయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ రామానాయుడు, స్థానిక మైనార్టీ నాయకులు పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు.