ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలిలో ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల గాలింపు కొనసాగుతోంది.