W.G: నరసాపురం టౌన్ వైఎన్ కళాశాల గ్రౌండ్లో జరుగుతున్న గోదావరి క్రీడా సంబరాలను శనివారం ఆర్డీవో దాసిరాజు ప్రారంభించారు. నరసాపురం సబ్ డివిజన్లోని పలు శాఖల్లో ఉద్యోగులు డిపార్ట్మెంట్ల వారీగా టీంలుగా విడిపోయి ఆటల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్డీవో దాసిరాజు క్యారమ్స్ ఆడి ఉద్యోగుల్లో ఆసక్తి రేపారు.