ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న నవోదయ పరీక్షలకు పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై నరసింహరావు మాట్లాడుతూ.. పరిక్ష కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.