SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అర్జీలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. శనివారం రణస్థలంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో ఎంపీకి వివరించారు. సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.