బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుపై ఆమిర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉందని, కథ, కథనాలపై వర్క్ జరుగుతుందని వెల్లడించాడు. ఇటీవల లోకేష్ తనకు కాల్ చేసి మాట్లాడాడని, త్వరలోనే ముంబై వచ్చి పూర్తి స్క్రిప్ట్ని వినిపిస్తానని చెప్పాడని తెలిపాడు.