NLG: ప్రశాంతమైన వాతావరణంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుపుకోవాలని, మిర్యాలగూడ రూరల్ సీఐ డి. ప్రసాద్ కోరారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం వేములపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై, ఎస్సై డి. వెంకటేశ్వర్లతో కలిసి,రాజకీయ నాయకులకు అవగాహన కల్పించారు. ఎన్నికల్లో ఓటర్లను డబ్బు మద్యంతో మభ్య పెడితే చర్యలు తప్పమన్నారు.