PDPL: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిర్వహించే తెలంగాణ ఉద్యమ మిలియన్ మార్చ్ కోసం జిల్లా కేంద్రం నుంచి ఉద్యమకారులు భారీగా తరలివెళ్లారు. జిల్లా అమరవీరుల స్తూపం వద్ద ఫోరం జిల్లా అధ్యక్షుడు ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక బస్సులో బయలుదేరిన ఈ బృందంలో నాయకులు చంద్రకళ, రాజేశం తదితరులు ఉన్నారు.