KDP: ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి శ్రీనివాసులును కిడ్నాప్ చేసి, దాడి చేసిన వసంత్ కుమార్ పై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రొద్దుటూరు MLA వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు. గురువారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. తుపాకీ గురిపెట్టి, కాళ్లతో తన్ని, కొడుతున్నా DSP ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.