JGL: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ వెల్గటూర్ మండలంలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి మండలంలోని పాశిగామ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను కలిసి వారి అవసరాలు, పాఠశాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టేలా అధికారులతో మాట్లాడతామన్నారు.