విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా డిసెంబర్ 15 నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్ వెంకీపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇక ఈ సినిమాలో కన్నడ నటి శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.