ప్రకాశం: కనిగిరి మండలం చీర్లదిన్నె మాజీ సర్పంచ్, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు అట్ల మల్లికార్జున్ రెడ్డి నిన్న గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే.మల్లికార్జున రెడ్డి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.