KNR: ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కళ్యాడపు ఆగయ్య మరణంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మానకొండూరు MLA డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించే నాయకులు అరుదని, అందులో కళ్యాణపు ఆగయ్య ఒకరని ఆయన పేర్కొన్నారు. కళ్యాడపు ఆగయ్య మృతితో ఆ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని అన్నారు.