RR: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 24 ఫిర్యాదులు అందినట్లు ఆమె తెలిపారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరిత పరిష్కారం చూపాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.