TG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు స్వామి వారిని ముస్తాబు చేసే పర్వంలో వటపత్ర శయన అలంకృతుడిగా తీర్చిదిద్దారు. అనంతరం మాడవీధులలో తీర్థజనుల దర్శనార్థం స్వామివారిని ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య దర్శనం పొందారు.