W.G: నరసాపురం రుస్తుంబాద వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యలమంచిలి మండలం చింతదెబ్బకు చెందిన కడలి వెంకటేశ్వరరావు (65) దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగల్తూరులో శుభకార్యానికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా, రుస్తుంబాద సమీపంలో ఆయన ప్రమాదవశాత్తు కిందపడ్డారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, పోలీసులు కేసు నమోదు చేశారు.