GDWL: సంస్థానపు చివరి పాలకురాలు మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ మహిళా లోకానికి స్ఫూర్తిప్రదాత. 1946-49 మధ్య పాలన సాగించిన ఆమె, నిజాం నవాబును ఎదిరించి న్యాయపోరాటం ద్వారా సంస్థానాన్ని నిలబెట్టుకున్నారు. సాహిత్య పోషణలో గద్వాలకు ‘విద్వద్గద్వాల’గా కీర్తి తెచ్చారు. ఆమె స్మరణార్థం కోటలో ఏర్పాటు చేసిన MALD డిగ్రీ కళాశాల జిల్లాలోనే మొదటిది. 1953 ఆగస్టు 18న మరణించే వరకు జనానికి సేవ చేశారు.