CTR: సీడీపీవో శోభారాణి ఆధ్వర్యంలో వెదురుకుప్పం మండలంలోని వెలుగు కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మోహన్ మురళి, చైల్డ్ హెల్ప్ లైన్ కో-ఆర్డినేటర్ నాగమణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ శకుంతల, ఏపీఎం పరుశురాం రెడ్డి తదితరులు పాల్గొని మహిళల సాధికారతపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.