KDP: కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షురాలు ఎన్.డీ విజయ జ్యోతి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ సెక్రెటరీ కుమార్ హాజరయ్యారు. రాబోయే లోకల్ కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుపొందించాలని వారు సూచించారు.