VSP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించనున్న ‘కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని’ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆశీలమెట్ట కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.