GST Collections: జీఎస్టీ వసూళ్లలో రికార్ట్..సర్కార్కి భారీ ఆదాయం
ఏప్రిల్ నెలలో 20వ తేది ఒక్కరోజే రూ.68,228 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు(GST Collections) ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కరోజులో జీఎస్టీ వసూళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది.
ఏప్రిల్ నెలలో అత్యధిక జీఎస్టీ వసూలు(GST Collections) చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నెల రోజుల్లో ప్రభుత్వం రూ.1.87 లక్షల కోట్లను వసూలు చేసినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ అత్యధికంగా వసూలు అయిన వాటిలో ఇదే ఎక్కువ కావడం విశేషం. గత ఏడాదిలో ఏప్రిల్ నెలలో జీఎస్టీ(GST) ద్వారా ప్రభుత్వం రూ.1.67 లక్షల కోట్లను వసూలు చేసిందని, గత ఏడాది కంటే ఈ ఏడాది జీఎస్టీ ద్వారా రూ.19,495 కోట్లు ఎక్కువగా వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ప్రధాని మోదీ చేసిన ట్వీట్:
Great news for the Indian economy! Rising tax collection despite lower tax rates shows the success of how GST has increased integration and compliance. https://t.co/xf1nfN9hrG
జీఎస్టీ ద్వారా భారీ వసూళ్లు(GST Collections) రావడంతో ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. పన్ను రేటు తక్కువగా ఉన్నా దేశంలో పన్నుల వసూళ్లు భారీగా పెరుగుతున్నాయని, భారత ఆర్థిక వ్యవస్థకు ఇదొక శుభవార్త అని అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన ప్రశంసించారు. ప్రధాని మోదీతో పాటుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా అధిక జీఎస్టీ వసూళ్లపై ట్వీట్ చేసింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్:
👉 #GST revenue collection for April 2023 highest ever at ₹1.87 lakh crore
👉 Gross #GST collection in April 2023 is all time high, ₹19,495 crore more than the next highest collection of ₹1,67,540 crore, in April 2022
ఏప్రిల్ నెలలో 20వ తేది ఒక్కరోజే రూ.68,228 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు(GST Collections) ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కరోజులో జీఎస్టీ వసూళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది. 20న 9.8 లక్షల లావాదేవీలు జరిగాయని తెలిపింది. ఇకపోతే దేశంలోనే అత్యధిక జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర ముందంజలో ఉంది. ఏప్రిల్ 2023లో మహారాష్ట్ర రూ.33,196 కోట్లు వసూలు చేయగా రెండో స్థానంలోని కర్ణాటక రూ.14,593 కోట్లు, గుజరాత్ రూ.11,721 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.