KMR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించబడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రారంభించారు. అనంతరం అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.