MNCL: జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు అధికారులు పరీక్షను నిర్వహించారు. పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ శనివారం కొనసాగింది. పంచాయతీరాజ్ చట్టం, పంచాయతీ విధులు, నిధులు, బాధ్యతలు, తదితర అంశాలపై వారికి శిక్షణ ఇచ్చి పరీక్షను నిర్వహించారు.