TG: HYDలోని ఫిల్మ్నగర్లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 43 తులాల బంగారం, రూ.లక్ష నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఓయూ కాలనీలో నివసిస్తున్న స్వప్న భర్త ఇటీవల చనిపోయారు. ఈ క్రమంలో గత నెల 27న అత్తవారింటికి వెళ్లి ఈనెల 5న తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చి చూసేసరికి బంగారం, నగదు చోరీ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.