MDK: రామాయంపేట 44వ జాతీయ రహదారి అయ్యప్ప దేవాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం నాగపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అదనపు డ్రైవర్ రాంజీ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.