MDK: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు కోవడానికి ఈనెల 6 చివరి రోజని జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ తెలిపారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.