సత్యసాయి: ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా నేరస్తులు, రౌడీషీటర్లకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. మహిళలు, బాలికలపై జరిగే వేధింపులు, లైంగిక దాడులు, నేరాలను అరికట్టేందుకు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని హెచ్చరిస్తూ, మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.