ADB: రైతుల స్థలాలను కబ్జా చేస్తూ, ప్రభుత్వ అధికారుల విధులను నిర్వర్తించకుండా వారిపై దాడులకు పాల్పడిన షేక్ అల్తాఫ్పై పీడీ కేసు నమోదు చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు ఆదివారం తెలిపారు. పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఏర్పాటు, పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.