BDK: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ స్వతంత్ర సమరయోధులు మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పూలమాల వేసి నివాళి అర్పించారు. గాంధీ అనుసరించిన సత్యమార్గాన్ని మనందరం అనుసరిస్తే రాగద్వేషాలు లేకుండా జీవించవచ్చని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.