కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ..మహాత్మా గాంధీ చూపిన అహింసా సత్యం,సేవా మార్గం వంటి సిద్ధాంతాలను అనుసరించాలన్నారు.