ప్రకాశం: మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామ సమీపంలో వెలసిన ముద్దసానమ్మ ఆలయంలో దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. అనంతరం అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు రూ.24,11,116 వేల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అందంగా అలంకరించారు.