SKLM: బెంతు ఒరియా కులస్థులకు న్యాయం చేయాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ బాబు కోరారు. గురువారం అమరావతిలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కె.రఘు రామ కృష్ణం రాజును కలిసి వినతిపత్రం అందజేసి, బెంతు ఒరియాల సమస్యలను వివరించారు. వారు ప్రధానంగా ఏ కులంలో ఉన్నారో తెలియని దుస్థితి నెలకొందని, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా జీవిస్తున్నారని తెలిపారు.