VKB: మత్తు పదార్థాల మహమ్మారిని తరిమికొట్టేందుకు ధారూర్ మండలంలో ఇవాళ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సీఐ రఘురాం పర్యవేక్షణలో ధారూర్, నాగసముందర్ సహా పలు గ్రామాల్లో ఈ సదస్సులు జరగనున్నాయి. యువత పెడదారి పట్టకుండా, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరుతూ భారీ ఎత్తున అవగాహన కల్పించనున్నారు.