ప్రకాశం: వెలిగండ్ల మండలం మొగులూరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాటి శ్రీనివాసులు రెడ్డి (60) అనే వృద్ధుడిపై అతని సొంత కుమారుడు భాస్కర్ రెడ్డి (ఆర్మీ జవాన్) విచక్షణ రహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాసులు రెడ్డిని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్తి కోసమే భాస్కర్ రెడ్డి తండ్రిపై దాడి చేశాడు.