WNP: కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ సందేశాలను పంపిస్తున్నారని, వాటికి ఎవరు స్పందించవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తెలియజేశారు. +84 అనే సిరీస్ నెంబర్ నుంచి పలువురు తహశీల్దార్లకు కలెక్టర్ ఫోటోతో నకిలీ సందేశాలు వెళ్లిన నేపథ్యంలో కలెక్టర్ ఈ ప్రకటన విడుదల చేసినట్లు వెల్లడించారు. దీంతో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.