KMM: దేశ సేవకు అంకితమైన ఉద్యమ ఊపిరి కొండ లక్ష్మణ్ బాపూజీ అని మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని మధిర మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారని, ఆయన సేవలు మరువలేనిదని పేర్కొన్నారు.