NTR: ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. దీంతో ఏర్పాటు చేసిన క్యూలైన్లన్నీ అమ్మవారి యొక్క భక్తులతో నిండిపోయాయి. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా అమ్మవారిని భక్తులు ప్రశాంతంగా దర్శించుకుంటున్నారు.