NTR: గంపలగూడెం ఎస్సై ఎస్. శ్రీనివాస్ శుక్రవారం తన సిబ్బందితో కలిసి తిరువూరు-గంపలగూడెం ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను నిలిపివేసి, వాటి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనదారులకు అవసరమైన సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ సుధీర్ కూడా పాల్గొన్నారు.