ప్రకాశం: కనిగిరి దరువు బజార్లో వెలసి ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజైన గురువారం ఈశ్వరి మాత అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆకుమల్ల విశ్వరూప ఆచారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.