SRCL: జిల్లా కేంద్రంలో నూతన న్యాయస్థాన భవన సముదాయానికి శ్రీకారం జరగనుంది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా రూపు దిద్దుకోనున్న న్యాయస్థాన భవనానికి ఈ నెల 7వ తేదీ శనివారం ఉదయం 10 గం.లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ వెల్లడించారు.