సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ కోవెలగుట్టపల్లిలో విద్యుత్ తీగ తెగిపడి పాడి గేదె మృతి చెందింది. బాధితుడు రమేష్ తెలిపిన వివరాల ప్రకారం నాలుగు నెలల క్రితం రూ.80 వేలతో గేదెను కొనుగోలు చేశారు. ప్రమాదవశాత్తు అది విద్యుత్ ఘాతానికి గురై చనిపోవడంతో కుటుంబానికి జీవనాధారం కోల్పోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు.