SRPT: రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ, సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో పలు జర్నలిస్టు సంఘాల నాయకులు, కమిటీల సభ్యులు యూనియన్లకు అతీతంగా మండల కేంద్రంలో జాతీయ రహదారి పైన నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసిల్దార్ సరితకు వినతి పత్రం అందించారు.