MBNR: బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం జడ్చర్ల నుంచి హైదరాబాద్ వెళుతున్న కంటైనర్ ముందున్న కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. భారీ వర్షం పడుతుండటంతో 44వ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై లెనిన్ ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు.